భారతీయులను ఏకం చేసిన వందేమాతరం గీతం

భారతీయులను ఏకం చేసిన  వందేమాతరం గీతం

జనగామ అర్బన్, వెలుగు: స్వతంత్ర ఉద్యమంలో వందేమాతర గేయం భారతీయులను ఐక్యం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వందేమాతర గేయం రచించి 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్​ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్​ నుంచి రైల్వే స్టేషన్​ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయుల గుండెల్లో నింపి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర వందేమాతరం గేయం వహించిందని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్​ఎన్​రెడ్డి, ఉడుగుల రమేశ్, మహాంకాళి హరిశ్చంద్రగుప్త, డాక్టర్​ కల్నల్​ భిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు.