స్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు

స్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు

నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేత పాల్వాయి రజిని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో నిజాం కాలం నుంచి ఉంటున్న నార్కట్ పల్లి బస్ డిపోను ఎత్తి వేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత పాల్వాయి రజిని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు స్మశాన వాటికను కూడా వదలకుండా కబ్జాలు చేశారన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూములపై పడ్డారంటూ మండిపడ్డారు.  బస్ డిపో ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు నిరసనను విరమించే ప్రసక్తే లేదన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

బార్డర్ నుంచి బాలీవుడ్ దాకా

ఐపీఎల్ కిక్కు: బౌలర్లే హీరోలవుతున్నరు..!

పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ దౌర్జన్యం

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు