ప్రశ్నిస్తే అరెస్టు చేయడం సరికాదు

 ప్రశ్నిస్తే అరెస్టు చేయడం సరికాదు

తప్పులను ప్రశ్నిస్తే అరెస్టు చేయడం సరికాదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రశ్నిస్తే అరెస్టు చేసే ధోరణిని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. హాస్పిటల్ సిబ్బంది అనుమతితోనే బీజేపీ నేతలు లోపలికి వెళ్లారని చెప్పారు. 7 సంవత్సరాల శిక్షకు కూడా పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ పోలీసులు అతిగా ప్రవర్తించారని రఘునందన్. ఇతరుల నోరు నొక్కే పనులను TRS నేతలు మానుకోవాలన్నారు.