
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఏప్రిల్ 17న శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఓ దుండగుడు ఫోన్లో బెదిరించాడు. ఈ ఆడియో కాల్ను రాజాసింగ్ ఆదివారం మీడియాకు విడుదల చేశారు. 71999 42827, 42235 32270 నంబర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఫోన్లో కాదు దమ్ముంటే నేరుగా రావాలని ఆగంతకుడుకి రాజాసింగ్ ఆడియో కాల్లోనే సవాల్ విసిరారు.