చంద్రబాబుకు ఓటేస్తే ఏపీ 40 ఏళ్లు వెనక్కి: సోమువీర్రాజు

చంద్రబాబుకు ఓటేస్తే ఏపీ 40 ఏళ్లు వెనక్కి: సోమువీర్రాజు

విజయవాడ:  చంద్రబాబుకి ఓటు వేస్తే ఏపీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గ్రాఫిక్ మాయాజాలంతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం ఏపీకి 6 లక్షల కోట్ల నిధులిస్తే నిధులన్నీ చంద్రబాబు మింగేశారని ఆరోపించారు.గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ఇసుక దందాపై 100 కోట్లు ఫైన్ వేసిందన్నారు. భారతదేశ రాజకీయల్లో ఎవరినన్న బహిష్కరించాల్సి వస్తే  ముందుగా చంద్రబాబుని బహిష్కరించాలని అన్నారు. వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేయగల ఒకే ఒక వ్యక్తి చంద్రబాబేనని…అవినీతి చేసిన వాళ్లే సీబీఎన్ ఆర్మీ మెంబెర్స్ అని అన్నారు. ప్రశ్నిస్తానని వచ్చిన పవన్  ప్రశ్నగా మిగిలిపోయాడని..పవన్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని విమర్శించారు. 2014 లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేద్దాం అంటే పవన్ ఒప్పుకోలేదని.. టీడీపీకి మద్దతు ఇచ్చాడని చెప్పారు. ఏపీలో సామాజిక వర్గాలు విచ్చిన్నం అవటానికి కారణం పవన్ అని ఆరోపించారు సోము వీర్రాజు.