బీజేపీ అభ్యర్థి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ

బీజేపీ అభ్యర్థి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ
  •      హైదరాబాద్ ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్థిగా మాధవీలత పోటీ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపల్లి మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. హైదరాబాద్ నుంచి మాధవీలత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు స్థానంలోని నియోజకవర్గాలన్నీ ఓల్డ్ సిటీలో ఉండడం, సెన్సిటివ్ ప్రాంతాలు కావడం, ప్రచారానికి వెళ్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ పోలీసులు కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 11 మంది కమాండోలు  మూడు షిఫ్ట్​లలో భద్రతను కల్పించనున్నారు.