బీజేపీ పోరాటాలకు కేసీఆర్​ వణుకుతున్నడు : కె.లక్ష్మణ్

బీజేపీ పోరాటాలకు కేసీఆర్​ వణుకుతున్నడు :   కె.లక్ష్మణ్

హనుమకొండ, వెలుగు:  సీఎం కేసీఆర్ హామీల అమలు,  ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలకు సీఎం కేసీఆర్​ వణుకుతున్నాడని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నాడని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్టీ పార్లమెంట్ బోర్డు మెంబర్​ డా.కె.లక్ష్మణ్​ మండిపడ్డారు. డబుల్​ బెడ్రూం ఇండ్లు, సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్​తో చేపట్టిన ఆందోళనల్లో పాల్గొని గాయపడిన పలువురు నేతలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డితో కలిసి గురువారం ఆయన పరామర్శించారు.   

అనంతరం ప్రెస్​మీట్​లో మాట్లాడారు..  - హామీలు ఇచ్చి మోసం చేస్తున్న  కేసీఆర్ ను చూస్తే  ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు దక్కేవరకు బీజేపీ పోరాడుతుందని, అందులో భాగంగానే సెప్టెంబర్​ 7న మిలియన్​ మార్చ్​ మాదిరిగా ‘చలో హైదరాబాద్’ నిర్వహించి ప్రభుత్వ కార్యకలాపాలను దిగ్బంధిస్తామని చెప్పారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నిరసనలు ఉంటాయన్నారు.