అక్రమంగా 126 చెట్లు నరికేసిండు.. బీజేపీ ఎంపీ సోదరుడు అరెస్ట్‌

అక్రమంగా 126 చెట్లు నరికేసిండు..  బీజేపీ ఎంపీ సోదరుడు అరెస్ట్‌

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో కోట్ల విలువైన 126 చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించిన కేసులో బీజేపీ ఎంపీ సోదరుడు ఆరెస్ట్ అయ్యాడు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహా హాసన్ జిల్లాలోని కోట్ల రూపాయల విలువైన 126 చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలించాడు. కోట్ల విలువైన కలపను అక్రమంగా అమ్మినట్లు విక్రమ్‌ సింహాపై అధికారులు  డిసెంబర్  24న  పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా అతడిని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15 రోజులకుపైగా సాగిన చెట్ల నరికివేత వ్యవహారంలో విక్రమ్‌ పాత్రపై తమవద్ద తగిన ఆధారాలు ఉన్నాయని అటవీ అధికారులు స్పష్టం చేశారు. 12 ఎకరాల అటవీ భూమిలో అల్లం పెంచాలని ఆయన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దానికి విరుద్ధంగా 126 చెట్లను నరికివేయడాన్ని గుర్తించిన అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.  కాగా విక్రమ్ సింహా ఎవరో కాదు ఇటీవల పార్లమెంట్ భద్రతలో భారీ ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో కర్ణాటక జీబేపీ ఎంపీ ప్రతాప్ సింహా  సోదరుడే.