విద్యార్థుల ఆందోళనను తప్పుదోవ పట్టిస్తున్నరు 

విద్యార్థుల ఆందోళనను తప్పుదోవ పట్టిస్తున్నరు 

బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. గత  విద్యార్థుల ముసుగులో కొందరు బయటి వ్యక్తులు అక్కడి ఆందోళనలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నరని ఆరోపించారు. అక్కడ జరిగే ప్రతి సంఘటనకూ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న ఆయన... ఇన్నిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.