దేశంలోని బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం పిలుపు

దేశంలోని బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం పిలుపు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దేశంలోని బీజేపీ ఎంపీలందరూ జూలై 16లోగా ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. జూలై 18వరకు ఢిల్లీలోనే ఉండాలని చెప్పింది. ఈ రెండ్రోజులు పార్టీ ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలనే దానిపై అవగాహన కల్పిస్తారని తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూలై 16న పార్టీ ఎంపీలందరితోనూ డిన్నర్‌‌‌‌ మీటింగ్‌‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్మును నామినేట్‌‌ చేశారు. ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి.