ప్లాన్ ప్రకారమే కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నం

ప్లాన్ ప్రకారమే కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నం

ప్లాన్ ప్రకారమే ఇల్లెందుకుంటలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నామన్నారు. కిషన్ రెడ్డిపై దాడి కేసీఆర్ డైరెక్షన్ లోనే జరిగిందన్నారు.  టీఆర్ఎస్ ఏం చేసినా హుజురాబాద్ లో గెలవలేదన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీలో జరిగినా పరిస్థితే హుజురాబాద్ లో రిపీట్ అవుతుందన్నారు.హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు క్యాడర్ లేదన్నారు. సర్వేలన్నీ హుజురాబాద్ లో బీజేపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. అందుకే ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు బీజేపీపై దాడులు చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది ఎవరో విచారణ జరపాలని ఎలక్షన్ కమిషన్ ను కోరారు. కేంద్రమంత్రిపై దాడిపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కిషన్ రెడ్డిపై దాడికి నిరసనగా (శనివారం) నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.