మంథని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని, ముత్తారం, వెలుగు: మంథనిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని బీజేపీ ఆఫీసులో శుక్రవారం సునీల్ రెడ్డి సమక్షంలో మంథని మండలం మల్లారం, మహదేవపూర్ మండలం కన్నెపల్లి, కాటారం మండలం దామరకుంట, మల్హార్​మండలం రావులపల్లి, ముత్తారం మండలం పాత, కొత్త జిల్లల్లపల్లి, అడవిశ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చెందిన మహిళలు, యువత పార్టీలో చేరారు.

సునీల్ ‌‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథనిలో బీజేపీ బలపడుతోందని, 40 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏండ్ల బీఆర్ఎస్​పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు.  కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతరవేన క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు  పెయ్యల కుమార్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కర్రె శ్రీవాణి తో పాటు తదితరులు ఉన్నారు.