బీజేపీలో చేరిన ఐటీ ఉద్యోగులు
కూకట్పల్లి, వెలుగు : టీఆర్ఎస్ అవినీతి సర్కార్ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోనే కాక దేశంలో ఎక్కడ ఏ స్కాం జరిగినా సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉందనే అంశాలు బయట పడుతుండండతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని దుయ్యబట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని కూకట్పల్లిలో పలువురు ఐటీ ఉద్యోగులు బీజేపీలో చేరారు. వారికి బండి సంజయ్పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం మొత్తాన్ని కలుషితం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు.
‘‘కింది నుంచి పైదాక ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ అవినీతి మయం చేయడంతో పైసలు లేకుండా ఒక్క చిన్న పని కూడా జరగక సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నరు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలక్షేపం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసినందుకు సిగ్గు పడాల్సింది పోయి ట్విట్టర్ టిల్లు అమెరికాకు వెళ్లే ముందు, వచ్చే ముందు మాత్రం ఫొటోలకు ఫోజులు కొడుతడు” అని బండి సంజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశ విజయాలను చూసి ప్రశంసిస్తుంటే కేసీఆర్, కేటీఆర్ మాత్రం చైనాని పొగుడుతూ దేశాన్ని కించపరుస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్రావు, మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ నాయకుడు పన్నాల హరీష్రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, మూసాపేట కార్పొరేటర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.