- ప్రవాభారతీయుల తో బండి సంజయ్ జూమ్ మీటింగ్
- బీజేపీ చేస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు
హైదరాబాద్: కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం ప్రవాస భారతీయులతో జరిగిన జూమ్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతోందన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకుల అవినీతిని బయటపెట్టేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. కేంద్రాన్ని బదనాం చేసి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ కేసీఆర్ కుట్రలు ఇక సాగవు అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..