
యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.స్థానిక ఎంపీగా ఉన్న తనను ఆలయ పునః ప్రారంభానికి పిలవలేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించిందన్నారు.దేవుడు దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. తనకు ఆహ్వానం వస్తదని పార్లమెంట్ సమావేశాలు ఉన్నా హైదరాబాద్ కు వచ్చి ఎదురు చూస్తున్నానని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం