దేశాన్ని మతం పేరుతో అసదుద్దీన్ ఓవైసీ విభజిస్తున్నారు

దేశాన్ని మతం పేరుతో అసదుద్దీన్ ఓవైసీ విభజిస్తున్నారు

దేశాన్ని మతం పేరుతో విభజించాలనేదే MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నమని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్. ఒవైసీ ప్రయత్నాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాటలు ఒకేలా ఉంటున్నాయన్నారు. నిజామాబాద్ లో CAAపై బీజేపీ నిర్వహించిన అవగాహన సభలో సునీల్ దేవ్ ధర్ పాల్గొన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనన్నారు. ఒవైసీ కావాలంటే లాహోర్, కరాచీ, కాబూల్ లలో సెక్యులరిజం గురించి లెక్చర్ ఇవ్వాలని సూచించారు.