సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ తన తల్లిని గుడికి వెళ్లకుండా ఆపాలని తాను సవాల్ చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం స్టాలిన్ తన తండ్రి, తాత కారణంగానే పదవిని అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం శాశ్వతమైంది. మొఘలులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రిస్టియన్ మిషనరీలు కూడా దీనిని ముట్టుకోలేకపోయాయి. దాన్ని నిర్మూలించడానికి ఆయనెవరని ప్రశ్నించారు.