టీఆర్ఎస్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారు

టీఆర్ఎస్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారు

కేసీఆర్ ముక్త్ తెలంగాణే తమ లక్ష్యమన్నారు బీజేపీ స్టేట్ ఇంచార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.  రైతులతో పాటు, అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామయాత్ర విజయవంతంలో ప్రతీ కార్యకర్త కృషి ఉందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారన్న ఆయన బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని..టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీవైపు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తి కోసం, కుటుంబం కోసం కాదు..దేశం కోసమే బీజేపీ ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. 

మరిన్ని వార్తల కోసం

సీనియర్ హీరోల ఫ్యామిలీలో చేరుతున్న క్రేజీ హీరోయిన్స్

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ కంపెనీ