అఖిలేష్ విదేశాలకు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు

అఖిలేష్ విదేశాలకు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. రెండోసారి కూడా బీజేపీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.  ఓటమి భయంతో మార్చి 11న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విదేశాలకు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారని విమర్శలు చేశారు. విపక్ష నేతల్లో చాలామంది అఖిలేష్ బాటలోనే విదేశాలకు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారని తెలిపారు.ఈసారి కూడా బీజేపీ 80 శాతం సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ అల్లర్లలో పాల్గొన్న వారు సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలతో సంబంధాలు ఉన్నాయని..ఈ విషయంపై కొందరు నేతలు మౌనం వీడాలని అన్నారు యోగి. తమ హయాంలో యూపీలో నేరాలు తగ్గాయన్నారు. అభివృద్ధికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు.

మరిన్ని వార్తల కోసం

 

బంకర్ నుంచి వీడియో తీసి పంపిన హైదరాబాద్ విద్యార్థులు

ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..