బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ డ్రామా

బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ డ్రామా

కామారెడ్డి​​, వెలుగు : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామా చేస్తోందని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్​ నీలం చిన్న రాజులు విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన  మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.  ముస్లింలను బీసీలలో కలుపకుండా రిజర్వేషన్​ పక్రియ చేపట్టాలన్నారు.  కాంగ్రెస్​ ఢిల్లీలో దొంగ దీక్షలు చేపట్టిందన్నారు. 

స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 13, 14 తేదీల్లో  హర్​ ఘర్​ తిరంగా యాత్రను ప్రతి  మండలం, గ్రామాల్లో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  మాజీ ఎమ్మెల్యే అరుణతార,  పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీలు  నరేందర్​రెడ్డి, రవీందర్​రావు,  నాయకులు కిషన్​రావు, వెంకటేశ్వర్​, మోటూరి శ్రీకాంత్,  వేణు, నరేందర్, శ్రీనివాస్,  సంతోష్​రెడ్డి, రవీందర్, రాజగోపాల్, లింగారావు, రంజిత్ పాల్గొన్నారు.