
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రాణాలర్పించిన భారత సైనికుల స్మారకార్థం నారాయణఖేడ్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీరాం యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు.
ఇందులో భాగంగా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసి వారి దేశభక్తిని చాటుకున్నారు. బ్లడ్ డొనేట్ చేసిన వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, శ్రీరామ్ సేన సంఘ సభ్యులు పాల్గొన్నారు.