మొసలి అంటేనే జనాలు భయపడతారు. ఇక అవి ఏ జంతువు దగ్గరకు వెళ్లినా... వాటి దగ్గరకు ఏ జంతువు వచ్చినా బలవ్వాల్సిందే. నీటిలో ఉన్నా.. నేలపై ఉన్నా భయంకరంగా వేటాడుతుంది. అది ఆహారం కోసం వేటకు వెళ్లిందా.. ఫారెస్ట్ కింగ్ సింహం దొరికినా సరే ఇంతే సంగతులు. ఇక మనుషుల సంగతి అయితే ఇక చెప్పక్కరలేదు. అందుకే కిలో మీటర్ల దూరంలో ముసలి ఉందంటే ఆ ప్రాంతం దరిదాపుల్లోకి వెళ్లాలంటే భయపడతారు. అలాంటిది ఓ వ్యక్తి వందలాది మొసళ్లు గుంపునకు భయాన్ని కల్పించాడు.
ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో మొసళ్లు ఉన్న నదిలో ఓ బోటు ప్రయాణిస్తుంది. అయితే బోటు ఇంజిన్ సౌండ్ కు మొసళ్లు భయపడి ఒడ్డుకు చేరుకున్నట్టు కనిపిస్తుంది. బోటు వేగంగా దూసుకెళుతుండంతో వందలాది మొసళ్లు నీటిలో పరిగెడుతుంటాయి. కొన్నింటిపై బోటు కూడా వెళుతుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
A terrifying boat pass through a river pic.twitter.com/PZVx55wHWM
— CCTV IDIOTS (@cctvidiots) August 16, 2023
ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కాని ఈ వీడియో మాత్రం CCTV IDIOTS’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక భయంకరమైన పడవ నది గుండా వెళుతుంది అని క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు. ఇక అంతే సోషల్ మీడియా యూజర్లు ఊరుకుంటారా.. మరి ఈ వీడియోకు లైక్స్ కామెంట్ల వర్షం కురిపించారు. వందల సంఖ్యలో మొసళ్లతో ఆడుకోవడం ఏంది సామీ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈడు మగాడ్రా బుజ్జి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అంత ప్రమాదకర నదిలో నుంచి ఆ బోటు ఎందుకు వెళ్ళింది? అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.