
- ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి
ఎడపల్లి, వెలుగు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలో మండలాల కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
2017 కు ముందున్న వారికే పార్టీ పదవుల్లో చోటు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, పార్టీ నాయకులు బిల్లా రాంమోహన్, ఈరంటి లింగం, కరుటూరి నారాయణ, ఎల్లయ్య యాదవ్, శంకర్ నాయుడు, భాస్కర్రెడ్డి, మల్కారెడ్డి, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, బోధన్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.