హైదరాబాద్ కుషాయిగూడలో మిస్సింగ్.. దుర్గం చెరువులో డెడ్ బాడీ

 హైదరాబాద్ కుషాయిగూడలో మిస్సింగ్.. దుర్గం చెరువులో డెడ్ బాడీ

హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి బాడీ దుర్గం చెరువులో తేలడం కలకలం రేపింది. ఆదివారం (జులై 27) ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో  మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు లేక్ పోలీసులు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లి డెడ్ బాడీని బయటకు తీశారు.

చనిపోయిన వ్యక్తిని కుషాయిగూడ సైనిక్ పురికి చెందిన దుర్గా ప్రసాద్ (36) గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు రోజులు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. ఫిర్యాదు మేరకు 26వ తేదీన కుషాయిగూడ లో మిస్సింగ్ కేసు నమోదైంది.

దుర్గ ప్రసాద్ సైనిక్ పురిలో RD Pro ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.