విద్యాశాఖ కీలక నిర్ణయం: బోయినపల్లి మేధా స్కూల్ అనుమతి రద్దు

విద్యాశాఖ కీలక నిర్ణయం: బోయినపల్లి మేధా స్కూల్ అనుమతి రద్దు

పద్మారావునగర్, వెలుగు: ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో బోయిన్​పల్లిలోని మేధా స్కూల్​ను అధికారులు ఆదివారం సీజ్ చేశారు. మేధా స్కూల్​ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఆ స్కూల్ విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన జయప్రకాశ్ గౌడ్​ ఓల్డ్ బోయిన్​పల్లి సాయికాలనీలో నివాసం ఉంటూ.. మేధా పేరుతో స్కూల్ నిర్వహిస్తున్నాడు. 

ఎక్కువ సంపాదించాలనే దురాశతో స్కూల్లోనే ఆల్ఫ్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. సమాచారం అందుకున్న ఈగల్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు చేసింది. జయప్రకాశ్ గౌడ్​తోపాటు అతనికి సహకరించిన బోయిన్​పల్లికి చెందిన ఉదయ్ సాయి, మురళిను అదుపులోకి తీసుకొన్నారు. ఈ దందాలో ఇంకా ఎవరైన ఉన్నారా...అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.