బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెపై సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనికా కపూర్ లండన్ రాగానే వందమందితో కలిసి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ చేసుకోవడం ఇందుకు కారణం. ఈ పార్టీలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇపుడు కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ పార్టీలో పాల్గొన్న వందలాది మందికి కరోనా లక్షణాలు ఉన్నాయా? లేవా వారు ఎందరిని కలుస్తున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అధికారులు వారి వివరాలను కనుక్కునే పనిలో పడ్డారు.
ఇదే విషయంపై బాలీవుడ్ డైరెక్టర్ అశోక్ పండిట్ కనికా కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. లండన్ ను వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లావనే వివరాలు అధికారుల వద్ద దాచిపెట్టి ఆమె బాధ్యతాయుతంగా వ్యవహరించిందన్నారు. అంతేగాకుండా ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ చేసుకుని వందలాది మందితో కాంటాక్ట్ అయ్యిందన్నారు. ఇపుడు తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ వందలాది మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టిందని ట్వీట్ చేశారు.
Shame on U @TheKanikakapoor
for being irresponsible by hiding ur details from the authorities, after U returned from #London & joining a party at a 5 star hotel, coming into contact with nearly 100 ppl.
Now that U hv tested #CoronaVirus +ve, U hv put others’ life also in danger.— Ashoke Pandit (@ashokepandit) March 20, 2020