
బాలీవుడ్ హీరోయిన్ అమిషా పటేల్సిక్కు భక్తుల ఆగ్రహానికి గురైంది. ఇటీవల ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్, కృతిసనన్ తిరుమల కొండపై ఆలింగనంతో పలకరించుకోవడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా అమిషా పటేల్ సైతం అచ్చం ఇలాంటి చిక్కుల్లోనే పడింది. బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘గదర్’ సినిమా సీక్వెల్లో అమిషా పటేల్ హీరోయిన్గా నటిస్తోంది. సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాలో కొన్ని సీన్లకు మూవీ టీం అనుమతులు తీసుకుంది. హీరో సన్నీ డియోల్తో షూట్ చేసిన కొన్ని సీన్లు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇందులో వారిద్దరూ సన్నిహితంగా కనిపించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుద్వారా నిర్వహకులు సైతం దీనిపై మండిపడుతున్నారు. వీరు క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అమిషా పటేల్ తెలుగులో పవన్కళ్యాణ్తో బద్రి, మహేశ్బాబుతో నాని, జూనీయర్ ఎన్టీఆర్తో నరసింహుడు వంటి సినిమాలు చేసింది.