
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి గౌరవం ఉండదని, అక్కడ నటించేందుకు చాలా కష్టపడ్డానని, అందుకే అక్కడ సినిమాలు చేయడం మానేశానని సంచనల కామెంట్స్ చేశారు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే(Radhika Apte). ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ గురించి, నటీనటుల గురించి అణిచిత కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను చాలా కష్టపడిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీనే. అక్కడ మగవారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆడవారిని ట్రీట్ చేసే విధానం మనం భరించలేము. సినిమాల్లో కూడా హీరోను దేవుడిలాగా చూడటమే హీరోయిన్స్ పాత్రగా ఉంటుంది. షూటింగ్ టైంలో హీరోయిన్లను సరిగా ట్రీట్ చేయరు. అక్కడన్నీ హీరోల మూడ్ను బట్టే జరుగుతాయి. అందుకే ఆక్కడ నటించడానికి చాలా కష్టపడ్డాను. ఆ కారణంగానే అక్కడ పని చేయడం మానేసాను అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు రాధికా ఆప్టే.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీపై రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక రాధికా ఆప్టే తెలుగులో చేసిన సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్, లయన్, రక్తచరిత్ర 1&2,ధోని, వంటి చిత్రాల్లో నటించారు.