
ముంబై: పతంజలి ఆయుర్వేద్ సంస్థకు బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ ఫైన్వేసింది. మంగళం ఆర్గానిక్స్ తమ కర్పూర ఉత్పత్తుల కాపీరైట్ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పతంజలి ఆయుర్వేద్పై దావా వేసింది. దీంతో కర్పూరం ఉత్పత్తులను విక్రయించడం లేదా ప్రచారం చేయడం వంటివి చేయొద్దని పతంజలిని ఆదేశిస్తూ.. ఆగస్టు 2023లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ దాని కర్పూర ఉత్పత్తులను విక్రయిస్తోందని మంగళం ఆర్గానిక్స్ కోర్టుకు సమాచారం ఇచ్చింది. దీనిపై అఫిడవిట్సమర్పించాలని పతంజలిని కోర్టు ఆదేశించింది. జూన్లో పతంజలి అఫిడవిట్ను సమర్పించింది. కోర్టు ఉత్తర్వుల తర్వాత రూ.49,57,861ల విలువైన కర్పూరం ఉత్పత్తి, సరఫరా జరిగిందని తెలిపింది. దీంతో రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని పతంజలి ఆయుర్వేద్ను బాంబే హైకోర్టు ఆదేశించింది.