శ్రీదేవిది సహజ మరణం కాదు..నాకు లై డిటెక్టర్‌ పరీక్షలు చేశారు.. బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు

శ్రీదేవిది సహజ మరణం కాదు..నాకు లై డిటెక్టర్‌ పరీక్షలు చేశారు.. బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఆమె భర్త బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణానికి సంబంధించి అసలు కారణాన్ని వెల్లడించారు. దుబాయ్ లో అసలు ఏం జరిగిందో తెలిపారు బోనీ కపూర్ .

శ్రీదేవి సినిమాల కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేదని బోనీ కపూర్ తెలిపారు. ఏండ్ల పాటు ఉప్పు లేకుండా తినేదని..ఎన్నిసార్లు చెప్పినా వినలేదన్నారు. ఉప్పు లేకుండా తినొద్దని డాక్టర్లు వారించినా శ్రీదేవి  పట్టించుకోలేదన్నారు.

తెరపై నాజూగ్గా, అందంగా కనిపించేందుకు శ్రీదేవి డైట్‌ చేస్తుండేదని బోనీ కపూర్ తెలిపారు. ఆమె స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవుతుందనే విషయం పెళ్లయ్యాకే తనకు తెలిసిందన్నారు. ఉప్పు లేకుండా భోజనం తీసుకునేదని... దానివల్ల నీరసించి పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. శ్రీదేవికి లో బీపీ సమస్యలు ఉన్నాయని.., జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పినా..ఆమె సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 

శ్రీదేవిది సహజ మరణం కాదని..ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని భావించి...దుబాయ్‌ పోలీసులు తనను 24 గంటలపాటు విచారించారని బోనీ కపూర్ తెలిపారు. అంతేకాకుండా దుబాయ్ పోలీసులు...తనకు  లై డిటెక్టర్‌ పరీక్షలు చేశారని చెప్పారు. ఇండియన్  మీడియా నుంచి ఒత్తిడి కారణంగానే తనను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు పేర్కొన్నారని వివరించారు. అయితే విచారణ మొత్తం పూర్తయ్యాక.. శ్రీదేవి మృతిలో  ఎలాంటి కుట్రకోణం లేదని  నిర్ధారించారని తెలిపారు. 

ALSO READ : పీఆర్‌సీ ఏర్పాటు.. ఉద్యోగులకు మధ్యంతర భృతి

శ్రీదేవి మరణించిన తర్వాత టాలీవుడ్  నటుడు నాగార్జున తనను కలిశారని బోనీకపూర్ వివరించారు. ఆమె  క్రాష్‌ డైట్‌ కారణంగా ఓసారి సెట్‌లో కూడా సృహతప్పి పడిపోయిందని చెప్పారన్నారు.  ఆ సమయంలో శ్రీదేవి పన్ను కూడా విరిగిందని..నాగార్జున చెప్పినట్లు బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. 

2018లో బంధువుల వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు.  ఆమె బాత్‌టబ్‌లో జారిపడి చనిపోయిందన‍్నట్లు దుబాయ్ పోలీసులు నిర్ధారించారు. అయితే  శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్‌ని అనుమానించారు.