
గుడిహత్నూర్, వెలుగు: ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఓ అమ్మాయిని వేధింపులకు గురిచేసిన ఓ యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్కు చెందిన గోపాల్ (20) ఓ యువతి పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్లో మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయి గురించి అసత్య ప్రచారం చేశాడు.
సదరు పోస్టులు చూసిన బాధిత యువతి షీటీమ్కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్తో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గోపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.