
కన్యాకుమారి టు చెన్నై.. దాదాపుగా 750 కిలోమీటర్లు. టార్గెట్ పదిరోజులు. ప్లాస్టిక్ లేని సొసైటీని చూడాలి. రెండు లక్షల విత్తనాలు నాటాలన్న లక్ష్యం. ఈ ఆలోచనతోనే కన్యాకుమారి నుంచి చెన్నైకి పరుగు మొదలుపెట్టాడు తొమ్మిదేళ్ల షర్వేష్. తన వయసు పిల్లలంతా ఆటపాటలతో బిజీగా ఉంటే షర్వేష్ మాత్రం ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై జనాల్లో అవగాహన పెంచడానికి రోడ్లపై పరుగులు తీస్తున్నాడు. దారి మధ్యలో ఖాళీ స్థలాల్లో రకరకాల పూలు, పండ్ల సీడ్ బాల్స్ నాటుతున్నాడు. షర్వేష్కు ఇలాంటి ప్రయోగాలు కొత్తేం కాదు. చిన్నప్పట్నించీ రన్నర్గా 146 మెడల్స్ అందుకున్నాడు ఈ చిచ్చర పిడుగు. అంతేకాదు ఐదేళ్ల వయసులోనే కిలోమీటర్ల మేర రివర్స్ వాకింగ్ చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకి ఎక్కాడు. ఇంతకుముందు 56 మారథాన్లలోనూ పార్టిసిపేట్ చేశాడు. వాటి ఇన్స్పిరేషన్తోనే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే నినాదంతో రీసెంట్గా కన్యాకుమారి టు చెన్నై జర్నీ మొదలుపెట్టాడు. ఈ జర్నీని పదిరోజుల్లోనే కంప్లీట్ చేస్తానని చెబుతున్నాడు కూడా.