ట్యాబ్ ఇవ్వలేదని బిల్డింగ్ పై నుంచి దూకిన బాలుడు

ట్యాబ్ ఇవ్వలేదని బిల్డింగ్ పై నుంచి దూకిన బాలుడు

మియాపూర్:  ఆడుకోవడానికి తన అన్న ట్యాబ్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన బాలుడు(12) బిల్డింగ్ పై నుంచి దూకాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మియాపూర్ లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలిచి వేసింది.

వివరాలు:

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు బాల వెంకట సత్య ప్రసాద్ (12) ట్యాబ్ తో ఆడుకుంటుంగా.. పెద్ద కొడుకు నంద కిషోర్ ట్యాబ్ కావాలని అడిగాడు. అయితే ఎంత అడిగినా ఇవ్వకపోయేసరికి తండ్రి శ్రీనివాస్ చిన్న కొడుకు సత్య ప్రసాద్ నుండి ట్యాబ్ ను తీసుకుని.. పెద్ద కుమారుడుకి ఇచ్చాడు.

దీంతో మనస్థాపానికి గురైన సత్య ప్రసాద్ .. క్షణికావేశంతో బిల్డింగ్ పై నుంచి కిందికి దూకాడు. అప్పటివరకు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా బిల్డింగ్ పై నుండి దూకి మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు తల్లితండ్రులు. మృతుడు సత్య ప్రసాద్ కొండాపూర్ లోని మహర్షి విద్యా మందిర్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.