బోయపాటి–రామ్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

బోయపాటి–రామ్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్‌ 5న సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ఇక ఎదురుచూపులు ముగిశాయి.. మాసివ్ ఎనర్జిటిక్ కాంబోతో దసరా వేడుకలు ప్రారంభిద్దాం. అక్టోబర్ 5న అప్‌ డేట్స్‌ రాబోతున్నాయి. వేచి ఉండండి’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ సినిమా పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. రామ్ కు సరిగ్గా సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. చాలా మాస్ అప్పీల్ ఉన్న కథ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.