అంబేడ్కర్ సిద్ధాంతాలు లక్షలాది మందికి స్ఫూర్తి

అంబేడ్కర్ సిద్ధాంతాలు లక్షలాది మందికి స్ఫూర్తి

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత భీమ్‌‌రావ్ రామ్‌‌జీ అంబేడ్కర్‌‌ను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను మోడీ తలచుకున్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానం, సిద్ధాంతాలు ఇప్పటికీ చాలా మందికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఏడాది ఈ రోజును మహాపరినిర్వాణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ విషయాన్ని మోడీ తన ట్వీట్‌‌లో రాసుకొచ్చారు. ‘మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌‌ను గుర్తు చేసుకుందాం. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు లక్షలాది మందికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మన దేశం గురించి ఆయన కన్న కలలను నెరవేర్చే దిశగా మేం కట్టుబడి ఉన్నాం’ అని మోడీ పేర్కొన్నారు. పరినిర్వాణ పదానికి బౌద్ధ సంప్రదాయంలో లోతైన అర్థం దాగుంది. పరినిర్వాణ అంటే ఓ వ్యక్తి తన జీవితకాలంతోపాటు మరణం తర్వాత కూడా మోక్షం పొందాడని చెప్పొచ్చు.