గ్రామస్తుల గొడవతో శ్రీవారి ఊరేగింపు ఆగింది

గ్రామస్తుల గొడవతో శ్రీవారి ఊరేగింపు ఆగింది

శ్రీకాళహస్తి: గ్రామస్తుల గొడవతో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపు మధ్యలోనే ఆగిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమానాడులో టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు  ఈనెల 22 నుంచి జరుగుతున్నాయి. అయితే తొండమానాడు గ్రామంలోని ఎగువవీధిలో ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతుంది.. అయితే ఎగువవీధిలోనే కాకుండా దిగువ వీధిలో కూడా ఊరేగింపు రావాలని దిగువ వీధి ప్రజలు పట్టుబట్టడంతో. ఇందుకు ఎగువవీధి గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో రోడ్డుపై బైటాయించిన దిగువవీధి గ్రామస్థులు నిరసన తెలిపారు. పోలీసులు జోక్యంచేసుకున్నా ఎవరూ పట్టువీడలేదు. సమస్య ఎంతసూపటికీ పరిష్కారం కాకపోయేసరికి శ్రీపాదకూలీలు స్వామివారి ఉత్సవమూర్తులను రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఊరేగింపు జరగకుండానే ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి చేర్చారు.