బ్రెజిల్ ని హరికేన్(తుపాన్) చిగురుటాకులా వణికించింది. తుపాన్ ధాటికి ఎంతో మంది నిరాశ్రయులు కాగా.. వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెజిల్దక్షిణ భాగంలోని అనేక నగరాల్లో వరదల ప్రభావంతో 21 మంది మృతి చెందారు.
ALSO READ : భారత ప్రధానమంత్రి మోదీ.. ఇప్పుడు ఈ పేరు కూడా మారిపోయింది
వరద నీరు తగ్గుతుండటంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. దేశంలోని 60 నగరాలపై హరికేన్ ప్రభావం పడిందని గవర్నర్ ఎడ్వర్డో లైట్ తెలిపారు.
గతంలోనూ ప్రకృతి విపత్తులు..
వాతావరణ మార్పుల కారణంగా హరికేన్ లు తరచూ ఏర్పడతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇదే ఏడాది వచ్చిన ఇంకో తుపాన్ కారణంగా 13 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఫిబ్రవరిలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి సావోపాలోలో 65 మంది మృతి చెందారు.