ఈ నెలలో.. ఈ 2 రోజులు తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ నెలలో.. ఈ 2 రోజులు తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

జులై నెలలో రెండు రోజుల పాటు తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూలై 15న శ్రీవారి ఆలయంలో  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవలు, 16న ఆణివార ఆస్థానం  ఉన్నందున ఈ రెండు రోజుల పాటు  వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తునట్లు ప్రకటన విడుదల చేశారు అధికారులు. 

జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుందని అధికారులు తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ALSO READ : ఐశ్వర్యరాయ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన అబిషేక్ బచ్చన్.

బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్న సందర్భంగా జూలై 14, 15వ తేదిల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.