పెళ్లిలో మొక్కలు పంచిన వధూవరులు

పెళ్లిలో మొక్కలు పంచిన వధూవరులు

కొత్తగా పెళ్లైన ఆ జంట ప్రకృతిపై దృష్టి పెట్టారు. వందలాది మొక్కలను పంపిణీ చేశారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వచ్చే బంధు మిత్రులకు.. రకరకాల రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే వీరు మాత్రం పచ్చని మొక్కలను ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఈడుపుగంటి భూపయ్య చౌదరి కుమార్తె శ్రీలక్ష్మి కావ్య వివాహం ధీరజ్ కృష్ణ చైతన్యతో జరిగింది. వివాహ రిసెప్షన్ కు వచ్చిన బంధుమిత్రులందరికీ రిటర్న్ గిఫ్ట్ గా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను అందజేశారు. ఈ మొక్కలను తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకింగ్ చేయించారు. పెళ్లికి వచ్చిన వారందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి ఈ మొక్కను అందుకోవడం అందరిని ఆకట్టుకుంది. వేదికను కూడా పచ్చని మొక్కలు, ఆకులతో డెకరేట్ చేశారు. పెళ్లికి వచ్చిన వారంతా మంచి పనిచేస్తున్నారంటూ వధూవరులను ప్రశంసించారు.