'BRO' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అటెన్షన్ బ్రోస్.. టైమింగ్ లో మార్పు

'BRO' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అటెన్షన్ బ్రోస్.. టైమింగ్ లో మార్పు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్(Sai Dharam) కాంబో లో వస్తోన్న మూవీ 'BRO'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జూలై 25న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతున్న సంగతి తెలిసిందే. 

కాగా లేటెస్ట్ అప్డేట్ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమింగ్స్ లో స్వల్ప మార్పులు ఉన్నాయని మేకర్స్ ప్రకటించారు. ఇవాళ సా. 6 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన ఫంక్షన్.. రాత్రి 8:30pm గంటలకు టైమింగ్ చేంజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ మార్పును చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇబ్బందులు కలగకుండా..ప్రతి ఒక్కరు 8:30 గంటలకు వేదిక వద్దకు చేరుకోవాలని యూనిట్ సభ్యులు సూచించారు. 

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కు భారీగా తరలి వస్తుండటంతో.. వర్షాల వాళ్ళ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కనుక వారిని కంట్రోల్ చేయడానికి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్..సాంగ్స్.. ఫాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. 

తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.