ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను మస్తు చూస్తుండ్రు

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను మస్తు చూస్తుండ్రు

ముంబై : రికార్డుల మోత మోగుతున్న ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను జనాలు కూడా మస్తు చూస్తుండ్రు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ నమోదైందని బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్స్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. తొలి రోజు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించారని తెలిపింది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చూసిన సమయం కూడా 1276 కోట్ల నిమిషాలుగా రికార్డైందన్నారు. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో ఇంత వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌, వాచ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ నమోదు కాలేదని అధికారిక బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్‌‌‌‌‌‌‌‌ డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.

‘ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ డే 16.8 కోట్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో 6.1 కోట్ల మంది వీక్షించారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చూసిన సమయం 1276 కోట్ల నిమిషాలుగా ఉంది. గత సీజన్‌‌‌‌‌‌‌‌ తొలి రోజు 870 కోట్ల నిమిషాలే నమోదయ్యాయి. టీవీ వీక్షణలోనూ16 శాతం పెరుగుదల కనిపించింది’ అని డిస్నీ పేర్కొంది. డిజిటల్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ జియోలో 11.3 కోట్ల వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది. 660 కోట్ల వాచ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ రికార్డైంది.