పాత కక్షలతో బావను చంపిండు

పాత కక్షలతో బావను చంపిండు

పాల్వంచ రూరల్​, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఉల్వనూరు గ్రామపంచాయతీ పరిధి పెద్దకలశ, గొత్తికోయ గుంపులో పాత కక్షలతో  సొంత బావను ఓ బావమరిది హత్య చేసిన ఘటన ఆదివారం ఆలస్యంగా బయటకొచ్చింది. పాల్వంచ రూరల్​ ఎస్​ఐ కార్తీక్​ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకలశ, గొత్తికోయ గుంపునకు చెందిన  బడిశా సురేశ్​(45) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మొక్కటి జోగా అక్కతో  కొన్ని  సంవత్సరాల కింద పెళ్లి జరిగింది. 

తాగుడుకు బానిసైన సురేశ్​ ప్రతీ రోజు భార్యను కొట్టేవాడు. కొద్దిరోజుల కింద ఆమె చనిపోయింది. అయితే తన అక్కను బావ  సురేశ్​ చంపి ఉంటాడని,  జోగా​ అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 18న పెద్దకలశ గ్రామం వద్ద సురేశ్​ను చంపి డెడ్​బాడీని చిర్దనపాడు వాగు పక్కన పూడ్చిపెట్టాడు. వారం రోజులుగా సురేశ్​కనబడకపోవడంతో గంగదేవిపల్లి  సర్పంచ్​ భర్త మంగయ్య ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు దర్యాప్తు చేస్తూ అనుమానంతో  జోగాను అదుపులోకి విచారించారు.  జోగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సురేశ్​డెడ్​బాడీకి  అదే స్థలంలో పోస్టుమార్టం చేశారు.