దొంగ బ్రదర్స్ అరెస్ట్.. ఒంటరి మహిళలే టార్గెట్

దొంగ బ్రదర్స్ అరెస్ట్.. ఒంటరి మహిళలే టార్గెట్

విశాఖపట్నం: ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను విశాఖ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని గాజువాక కు చెందిన గోపీనాథ్, చంద్ర శేఖర్ అనే ఇద్దరు బ్రదర్స్ 2016 నుంచి పలు చోట్ల దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు వీరు 51 చెన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.

బుధవారం పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి, వారి దగ్గర నుంచి 1.25కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ చదువుకున్నవారే. ఒకరు బీటెక్, మరొకరు డిప్లొమా. వీరి తండ్రి వెంకటరమణ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు..  ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.