బీఆర్ఎస్​ కొండా లక్ష్మణ్​ బాపూజీని అవమానపరిచింది: మంత్రి పొన్నం

 బీఆర్ఎస్​ కొండా లక్ష్మణ్​ బాపూజీని  అవమానపరిచింది: మంత్రి పొన్నం

రవీంధ్రభారతిలో కొండా లక్ష్మణ్​ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి.  తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే బాపూజీ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడేంత వరకు తాను ఎలాంటి పదవి తీసుకొనని చెప్పిన నాయకుడిని గత ప్రభుత్వం అవమానపరిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  ఆయన అంత్యక్రియల సమయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాలేదన్నారు.  పద్మశాలి కులానికి చెందిన వారు రాజకీయాల్లో పెద్దగా లేరని.. ఈ విషయంలో కుల సంఘాల నేతలు ఆలోచించాలన్నారు. 

ALSO READ | కొండాలక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీని ఎవరూ సపోర్ట్​ చేయకపోయినా .. ఆయనకు ఎవరూ అవకాశం ఇవ్వకపోయినా.. ఆయనే అవకాశాను ఎతుక్కుంటూ  గొప్పనాయకుడు అయ్యారని మంత్రి తెలిపారు.  బాపూజీ వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్​ రెడ్డితో చర్చిస్తానన్నారు. సిరిసిల్ల చేనేత చీరలు ఆపేస్తారని విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వం చేనేత వస్త్రాలను వాడేందుక కట్టుబడి ఉందన్నారు.