బైకును ఢీకొన్న నటుడు రఘుబాబు కారు..బీఆర్ఎస్ నాయకుడు మృతి..

బైకును ఢీకొన్న నటుడు రఘుబాబు కారు..బీఆర్ఎస్ నాయకుడు మృతి..

సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి చెందిన సంఘటన నల్గొండలో చోటుచేసుకుంది. నల్గొండ టూ టౌన్ సీఐ డానియల్ కుమార్, ఎస్ఐ రావుల నాగరాజు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (51) బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ చేసి ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవాడు.

అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం సమయంలో రిక్షా పుల్లర్స్​ కాలనీ వద్ద ఉన్న వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కేఏ 03 ఎంపీ 69 14 నెంబర్ గల బీఎండబ్ల్యూ వాహనం జనార్దన్ రావు వెళుతున్న బైక్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.