జనగామ, వెలుగు: ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్రావు దిట్ట అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్టలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే 9వ షెడ్యూల్లో చేర్చితేనే సాధ్యమన్నారు. బీజేపీకి బీసీలపై ప్రేమ ఉంటే ఆ పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిందని, మోదీకి ఇష్టంలేకనే పట్టించుకోలేదని ఆరోపించారు. వారిపై వచ్చేఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే హరీశ్రావు, కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. మందుగా కవిత ఆరోపణలకు హరీశ్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. పంచాయతీ ఎన్నిక తరువాత అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్, మండల నాయకులు పాల్గొన్నారు.
