- డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథంపై ముందుకుపడ్డ మంత్రి
- నుదుటికి స్వల్ప గాయం.. ఆర్మూర్ లో ఘటన
- వెహికల్ పైనుంచి పూర్తిగా కిందపడిన ఎంపీ సురేశ్ రెడ్డి
- సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికీ గాయాలు
నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎంపీ సురేశ్రెడ్డితో కలిసి ప్రచారరథంపై ఆయన వెళ్తుండగా.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో, ప్రచార రథం రెయిలింగ్ విరిగి ముగ్గురూ ముందుకుపడ్డారు. అందరూ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఆర్మూర్ బీఆర్ఎస్అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి గురువారం భారీ ర్యాలీ తీశారు. దీనికి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన ప్రచార రథంపై స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్తుండగా, స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ సడెన్ బ్రేక్వేశాడు.
దీంతో వెహికల్ రెయిలింగ్ విరిగి కేటీఆర్సహా అంతా ముందుకు పడ్డారు. ఎంపీ సురేశ్రెడ్డి పూర్తిగా వెహికల్ నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో కేటీఆర్నుదుటికి గాయమైంది. ఆయన ఫస్ట్ఎయిడ్చేయించుకుని, అక్కడి నుంచి కొడంగల్రోడ్షోకు హెలికాప్టర్లో వెళ్లారు. అనంతరం తాను క్షేమంగా ఉన్నట్టు ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ ప్రమాదంలో సురేశ్రెడ్డి, జీవన్రెడ్డికీ స్పల్వ గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రచార రథంపై కేటీఆర్, జీవన్రెడ్డి, సురేశ్రెడ్డితో పాటు మరో 10 మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.