ర్యాలీలో కేటీఆర్​కు ప్రమాదం .. ఆర్మూర్ లో ఘటన 

ర్యాలీలో కేటీఆర్​కు ప్రమాదం .. ఆర్మూర్ లో ఘటన 
  • డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథంపై ముందుకుపడ్డ మంత్రి 
  • నుదుటికి స్వల్ప గాయం.. ఆర్మూర్ లో ఘటన 
  • వెహికల్ పైనుంచి పూర్తిగా కిందపడిన ఎంపీ సురేశ్ రెడ్డి
  • సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికీ గాయాలు  

నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఆర్మూర్​లో ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, ఎంపీ సురేశ్​రెడ్డితో కలిసి ప్రచారరథంపై ఆయన వెళ్తుండగా.. డ్రైవర్ సడెన్ ​బ్రేక్​ వేయడంతో, ప్రచార రథం రెయిలింగ్ విరిగి ముగ్గురూ ముందుకుపడ్డారు. అందరూ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఆర్మూర్​ బీఆర్ఎస్​అభ్యర్థిగా నామినేషన్​ వేసేందుకు ఎమ్మెల్యే జీవన్​రెడ్డి గురువారం భారీ ర్యాలీ తీశారు. దీనికి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన ప్రచార రథంపై స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్తుండగా, స్పీడ్​ బ్రేకర్ వద్ద డ్రైవర్​ సడెన్​ బ్రేక్​వేశాడు. 

దీంతో వెహికల్ రెయిలింగ్​ విరిగి కేటీఆర్​సహా అంతా ముందుకు పడ్డారు. ఎంపీ సురేశ్​రెడ్డి పూర్తిగా వెహికల్​ నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో కేటీఆర్​నుదుటికి గాయమైంది. ఆయన ఫస్ట్​ఎయిడ్​చేయించుకుని, అక్కడి నుంచి కొడంగల్​రోడ్​షోకు హెలికాప్టర్​లో వెళ్లారు. అనంతరం తాను క్షేమంగా ఉన్నట్టు ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ ప్రమాదంలో సురేశ్​రెడ్డి, జీవన్​రెడ్డికీ స్పల్వ గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రచార రథంపై కేటీఆర్, జీవన్​రెడ్డి, సురేశ్​రెడ్డితో పాటు మరో 10 మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.