బీఆర్​ఎస్​ టూ కాంగ్రెస్​ .. సీఎం రేవంత్​ సమక్షంలో పార్టీలో చేరికలు

బీఆర్​ఎస్​ టూ కాంగ్రెస్​ .. సీఎం రేవంత్​ సమక్షంలో పార్టీలో చేరికలు

జనగామ, వెలుగు: స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటే అంటూ అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరుతున్నారు. గురువారం కడియం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో పలువురును నేతలు కండువా కప్పుకున్నారు.

చేరిన వారిలో లింగాల ఘన్​పూర్, రఘునాథపల్లి, జఫర్​ఘడ్, ధర్మసాగర్ మండలాల జడ్పీటీసీలు గుడి వంశీ , బొల్లం అజయ్, ఇల్లందుల బేబీ, పిట్టల శ్రీలత సత్యనారాయణ, వేలేరు, చిల్పూరు, ఘన్​పూర్, జఫర్​ఘడ్ ఎంపీపీలు సమ్మిరెడ్డి, సరితా బాలరాజు, రేఖా గట్టయ్య, సుదర్శన్, మాజీ మార్కెట్​కమిటీ చైర్మన్లు, మాజీ పీఏసీఎస్​చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.