- రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అంటేనే ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ అని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి అన్నారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను బహిష్కరించినందునే రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీ ‘బహిష్కరణ రాష్ట్ర సమితి’ గా మారిందని ఆరోపించారు.
రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ అనే పార్టీని తెలంగాణ ప్రజలు మరిచిపోయారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నాటకాన్ని ప్రదర్శించి.. కేటీఆర్, హరీశ్ రావులు ఆయన పేరును స్మరించుకుంటూ పునీతులయ్యారన్నారు.
