షర్మిల.. షూస్ కంపెనీ పెట్టినవా : పెద్ది సుదర్శన్ రెడ్డి

షర్మిల.. షూస్ కంపెనీ పెట్టినవా : పెద్ది సుదర్శన్ రెడ్డి

సీఎం కేసీఆర్కు వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల షూ పంపడంపై నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. షర్మిల కొత్తగా షూ కంపెనీ పెట్టిందా అని సటైర్ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంత చిల్లరగా ఎప్పుడూ మాట్లాడలేదని కానీ ఆయన కూతురు ఇప్పుడు ఇలా కామెంట్లు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ను టార్గెట్ చేస్తున్న షర్మిల 4 కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పెద్ది మండిపడ్డారు. విపక్ష నేతలు ఎవరు పాదయాత్రలు చేసినా వారందరి అజెండాలు ఒక్కటేనని విమర్శించారు.

కేంద్ర బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని, తెలంగాణ భారతదేశంలో లేదా అని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ లో రాష్ట్ర వాటా ఎంతో చెప్పాలని బండి సంజయ్ ను డిమాండ్ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకే కేంద్ర రాష్ట్రంపై పగ తీర్చుకుంటుందని మండిపడ్డారు. బడ్జెట్ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పత్తాలేకుండా పోయారని అన్నారు.కేంద్రం ప్రవేశపెట్టింది ముమ్మాటికీ అదానీ బడ్జెటేనని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.